రేషన్ కార్డు లబ్దిదారులకు శుభవార్త..

135
ts ration cards
- Advertisement -

రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్దిదారులకు శుభవార్త. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అందిస్తున్న రేషన్‌ బియ్యం కోటా పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఇస్తున్న ఐదు కిలోల బియ్యంతో కలిపి రేషన్‌ కార్డు ఉన్న కుటుంబంలోని ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మే నెల కోటా బియ్యం ఇవ్వనుంది. ఈ మేరకు వచ్చే నెలకు సంబంధించిన కోటాను విడుదల చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 82.50 లక్షల రేషన్‌ కార్డుదారులకు 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం పట్ల పలుగురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ప్రైవేట్ టీచర్లకు ఉచితంగా సన్నబియ్యం, రెండు వేల రూపాయలు ఇస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -