మొక్కలు నాటిన వోరగంటి ఆనంద్

526
green india
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జి వి రామకృష్ణ రావు విసిరిన చాలెంజ్ స్వీకరించారు రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు వోరగంటి ఆనంద్. కరీంనగర్ లోని తన స్వగృహం నందు మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు, హరిత తెలంగాణగా నిర్మించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ చాలెంజ్ ప్రపంచ దేశాల్లోని తెలంగాణ వారు కూడా స్వీకరించారని గుర్తు చేశారు.

Oraganti Anand

అనంతరం తాను మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, మల్లాపూర్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ దుర్గా రెడ్డి, బిషప్ గొల్లపెల్లి జాన్, తన చాలెంజ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, రెండ్ల సాయి కిరణ్ బీర్పూర్ వివేక్, రమేష్, స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -