నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన చిత్రం `అశ్వథ్థామ`.ఈ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా జనవరి 31న విడుదలవుతుంది. ఈ సినిమా టీజర్ని డిసెంబర్ 27న హైదరాబాద్ రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో విడుదల చేశారు. ఉదయం 11గంటల 7 నిమిషాలకు హీరోయిన్ సమంత ట్విట్టర్లో ఈ టీజర్ను విడుల చేశారు. ఈ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో హీరో నాగశౌర్య, సమర్పకుడు శంకర్ ప్రసాద్ ముల్పూరి, నిర్మాత ఉషా ముల్పూరి, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, దర్శకుడు రమణ తేజ, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ మనోజ్ రెడ్డి, బి.వి.యస్.రవి, ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తనయుడు యతీష్ పాల్గొన్నారు.
చిత్ర దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ – “నన్ను నమ్మి ఇంత భారీ సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు థాంక్స్. కంటెంట్ సినిమాలో కీలకంగా ఉంటుంది. శౌర్య ఐడియా చాలా బాగుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. నాగశౌర్య విశ్వరూపం ఈ చిత్రంలో చూస్తారు. అంత అద్భుతంగా నటించారు. ప్రతి సన్నివేశం థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇలాంటి బిగ్ కమర్షియల్ మూవీ నాలాంటి కొత్త డైరెక్టర్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. మనోజ్ బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. శ్రీ చరణ్ మ్యూజిక్ అమేజింగ్. ఎడిటర్ గ్యారీ సెట్ కి వచ్చి ఆన్లైన్ ఎడిటింగ్ చేశాడు. సినిమా అందరికి నచ్చుతుంది.. అన్నారు.
నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ – “ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్స్, సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా టీమ్ అందరూ హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశారు. జనవరి 31న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తప్పకుండా మంచి విజయం సాదిస్తుంది.. అన్నారు.
హీరో నాగ శౌర్య మాట్లాడుతూ – `ఛలో` టీజర్ ఇక్కడే రిలీజ్ చేశాం.. బ్లాక్ బస్టర్ అయింది. `నర్తనశాల` టీజర్ కూడా ఇదే ప్లేస్ లో రిలీజ్ చేశాం. డిజాస్టర్ అయింది..మరి ఇప్పుడు `అశ్వథ్థామ` టీజర్ రిలీజ్ చేస్తున్నాం. బ్లాక్ బస్టర్ అవుతుందని గర్వంగా చెప్పగలను. ఢిల్లీ, ముంబై లలో అమ్మాయిలపై జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకొని ఈ చిత్రం కథను రాసుకున్నాను. `చలో`కి కథ రాశాను. కానీ పేరు వేసుకోలేదు. నాకు బేసిగ్గా కథలు రాయడం, చెప్పడం ఇష్టం. అమ్మాయిలకు రక్షణ లేదు అందరూ బాగుండాలి అని ఈ సినిమా తీశాం. నాకు లవర్ బాయ్ ఇమేజ్ అంటే చాలా చిరాకు.. దాని నుండి బయటికి వచ్చి రఫ్ గా వుండే క్యారెక్టర్ చేశాను. నాకు అలాగే ఉండటం ఇష్టం. మనోజ్ రెడ్డి నన్ను కొత్తగా చూపించాడు. నేను ఏదైతే కథ అనుకున్నానో దానిని చక్కగా తెరకెక్కించాడు..తేజ. ఈ సినిమాకి స్ట్రాంగెస్ట్ పిల్లర్ గ్యారీ. సెట్లో వుండి వర్క్ చేశాడు. తేజ, గ్యారీ, మనోజ్, నేను మేము నలుగురం 6నెలలు ట్రావెల్ చేసి ఈ కథపై వర్క్ చేశాం. అలా చేయడం వాళ్ళ వర్కింగ్ డేస్ చాలా తగ్గాయి. ఎలాంటి టెన్షన్ లేకుండా అనుకున్న టైంలోనే సినిమా పూర్తి చేశాం. శ్రీ చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత పెద్ద కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఫస్ట్ టైం కమర్షియల్ మూవీ చేస్తున్నాను. నా తల్లితండ్రులు గర్వంగా తలెత్తుకునేలా ఈ సినిమా చేశాను. ప్రేక్షకులకి తప్పకుండా సినిమా నచ్చుతుంది. మెహ్రీన్ చాలా అందంగా ఈ చిత్రంలో కనిపిస్తుంది. అలాగే ఒక కొత్త విలన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నేను ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎగ్జయిట్ అవుతూ రాసిన విలన్ పాత్రలో జిషు నటించాడు. మంచి కథ రాశాను.. నచ్చింది.. సినిమా చేశాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను“ అన్నారు.