నాకు నలుగురు కొడుకులుః అల్లు అరవింద్

497
Allu Aravind
- Advertisement -

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ టాలీవుడ్ లో నెంబర్ వన్ నిర్మాతగా కొనసాగుతున్నాడు. అల్లు అరవింద్ తెరకెక్కించిన సనిమాలు దాదాపుగా అన్ని విజయం సాధించాయి. వరుస విజయాలు రావడంతో గీతా ఆర్ట్స్ 2 పేరుతో మరో నిర్మాణ సంస్ధను స్ధాపించాడు. ఈ బ్యానర్ కు సంబంధించిన నిర్మాణ వ్యవహారాలను బన్నీ వాసుకు అప్పగించాడు. అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు బన్నీ వాసు.తనపట్ల అల్లు అరవింద్ కి గల నమ్మకాన్ని బన్నీ వాసు నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. బన్నీ వాసు నిర్మాణంలో వచ్చిన ప్రతిరోజూ పండగే మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈమూవీతో అల్లు అరవింద్ కు భారీగా లాభాలు వచ్చాయి. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభం వచ్చింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్ మూవీగా నిలిచింది. అయితే ఈరోజు ఈమూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈకార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బన్నీ వాసు చాలా మంచి వ్యక్తి. నాకు కావాల్సిన వాళ్లలో బన్నీ వాసు ఒకరు. బన్నీ వాసును నా కుటుంబ సభ్యుడిలా చూసుకుంటాను. అతను నా కొడుకులాంటి వాడే. బన్నీ వాసుతో కలిపి నాకు నలుగురు కొడుకులు. అతను నా నాలుగో కొడుకు అన్నప్పుడల్లా..అతనికి కూడా ఆస్తులు రాసిస్తానేమోనని నా ముగ్గురు కొడుకులు భయపడుతుంటారు అని నవ్వుతూ అన్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.

- Advertisement -