73 వేలకు చేరిన కరోనా కేసులు..

183
ap corona cases
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73 వేలు దాటాయి. గత 24 గంటల్లో 2,092 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 13 మంది మృత్యువాతపడ్డారు.

దీంతో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 73,050కు చేరగా 589 మంది మృతిచెందారు. కరోనా మహమ్మారి నుండి 52,103 మంది కోలుకోని డిశ్చార్జ్ కాగా 20,358 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇప్పటివరకు 5,43,489 కరోనా టెస్టులు నిర్వహించామని….గత 24 గంటల్లో 21,346 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.

- Advertisement -