దేశంలో 20 లక్షలకు చేరువలో కరోనా కేసులు

171
corona in delhi
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలకు చేరువైంది. రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో రికార్డు స్ధాయిలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

గ‌త 24 గంట‌ల్లో 56,282 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 904 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు నమోదైన క‌రోనా కేసుల సంఖ్య 19,64,537కు చేరింది. ప్రస్తుతం దేశంలో 5,95,501 యాక్టివ్ కేసులు ఉండగా 13,28,337 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.

దేశంలో ఇప్పటివరకు 2 కోట్ల 21 లక్షల 49 వేల 351 కరోనా టెస్టులు నిర్వహించామని…గత 24 గంటల్లో 6,64,949 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

- Advertisement -