50 వేలు దాటిన కరోనా కేసులు..

168
corona in karnataka
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటాయి. గత 24 గంట‌ల్లో 1,567 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 9 మంది మృత్యువాతపడ్డారు.

దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,826కు చేరుకోగా 438 మంది మ‌ర‌ణించారు. కరోనా మహమ్మారి నుండి 39,327 మంది కోలుకోగా ప్రస్తుతం 11,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను చూస్తే జీహెచ్ఎంసీ ప‌రిధిలో 662 కేసులు న‌మోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 213, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 75, సిరిసిల్ల‌లో 62, కాగ‌ర్ క‌ర్నూల్‌లో 51 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -