కేటీఆర్ బర్త్ డే సందర్భంగా సేవా కార్యక్రమాలు..

255
talasani srinivas
- Advertisement -

ఈ నెల 24 వ తేదీన మున్సిపల్ శాఖ మంత్రి, TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్పొరేటర్లు, trs పార్టీ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు.

ఉదయం 9.30 గంటలకు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కలాసిగూడ లోని ప్రభుత్వ పాఠశాలలో DEO వెంకటనర్సమ్మ తో కలిసి విద్యార్ధులకు బుక్స్ పంపిణీ చేయడంతో పాటు పాఠశాల ఆవరణలో మొక్కలను నాటుతారు. అనంతరం రాం గోపాల్ పేట కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని కేక్ కట్ చేస్తారు. అదేవిధంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో SRT లో మొక్కలు నాటే కార్యక్రమం, పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నారు. అమీర్ పేట డివిజన్ డివిజన్ పరిధిలోని లైబ్రరీ పార్క్ లో కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో మొక్కలు నాటుతారు.

11.00 గంటలకు బోయిగూడలోని ఓల్డ్ ఏజ్ హోం లో పద్మారావు నగర్ TRS పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండ్ల పంపిణీ, కేక్ కటింగ్ కార్యక్రమాలలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ TRS ఇంచార్జి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి లు పాల్గొంటారు. అదేవిధంగా మోండా మార్కెట్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ ఆధ్వర్యంలో మారేడ్ పల్లి లోని టీచర్స్ కాలనీ లో మొక్కలు నాటడం తో పాటు హిల్ స్ట్రీట్ స్కూల్ లో విద్యార్ధులకు బుక్స్ పంపిణీ చేస్తారు.

రెజిమెంటల్ బజార్ లోని హోం ఫర్ ద డిసేబుల్డ్ లో 11.40 గంటలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ TRS ఇంచార్జి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొంటారు. బేగంపేట డివిజన్ పరిధిలో కార్పొరేటర్ ఉప్పల తరుణీ ఆధ్వర్యంలో ఓల్డ్ కష్టం బస్తీ, బండి మెట్ పాఠశాలలలో విద్యార్ధులకు బుక్స్ పంపిణీ అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతారు. trs సేనియర్ నాయకులు నరేందర్ రావు ఆధ్వర్యంలో రాణిగంజ్ లోని పాల్ డోస్ హాస్పిటల్ లో పండ్లు, మాస్క్ లు, శాని టైజర్ లు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12,00 గంటలకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్ మంత్రి శ్రీ KTR జన్మదినాన్ని పురస్కరించుకొని తన సొంత నిధులు 35 లక్షల రూపాయల తో GHMC విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ లోని 1000 మంది స్ప్రేయింగ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వర్తించే విధంగా ఇన్సురెన్స్ పత్రాలను ట్యాంక్ బండ్ లోని బుద్దభవన్ లో అందజేస్తారు.

- Advertisement -