- Advertisement -
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 1,637 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,44,143కు చేరుకున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 18,100 యాక్టివ్ కేసులుండగా 15,335 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు 2,24,686 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకోగా 1357మంది మృతి చెందారు.
కోవిడ్ మరణాల రేటు భారత్ వ్యాప్తంగా 1.5 శాతంగా ఉంటే.. తెలంగాణలో అది 0.55 శాతంగా ఉంది. రికవరీ రేటు దేశంలో 92.1 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 92.03% శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
- Advertisement -