రాష్ట్రంలో 24 గంటల్లో 1986 కరోనా కేసులు నమోదు..

296
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1986 కరోనా పాజిటివ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 62,703కు చేరింది. గత 24 గంటల్లో క‌రోనాతో 14 మంది చనిపోగా ఇప్ప‌టివ‌ర‌కు 519 మంది మృతిచెందారు.

జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే జీహెచ్ఎంసీ ప‌రిధిలో 586 కేసులు, మేడ్చెల్ జిల్లాలో 207, రంగారెడ్డి జిల్లాలో 205, వరంగ‌ల్ అర్బ‌న్‌లో 123, క‌రీంన‌గ‌ర్‌లో 116, సంగారెడ్డిలో 108, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 61, మెద‌క్‌లో 45, ఖ‌మ్మంలో 41 కేసులు నమోదయ్యాయి.

న‌ల్ల‌గొండలో 36, మంచిర్యాల 35, గ‌ద్వాల 32, నాగ‌ర్‌క‌ర్నూల్‌, వరంగ‌ల్ రూర‌ల్‌లో 30 చొప్పున‌, కొత్త‌గూడె 29, ములుగు 27, పెద్ద‌ప‌ల్లి 26, సిరిసిల్ల 23, జ‌న‌గామ 21, సిద్దిపేట 20, నిజామాబాద్‌లో 19, వ‌న‌ప‌ర్తిలో 18, ఆదిలాబాద్ 16, భువ‌న‌గిరి 12 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -