24 గంటల్లో 2534 కరోనా కేసులు…

166
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. 24 గంటల్లో 2534 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్షా 50 వేలు దాటాయి.

ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1,50,176కు చేరగా 1,17,143 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25,066 యాక్టివ్‌ కేసులుండగా 927 మంది కరోనాతో మృతిచెందారు.

24 గంటల్లో నమోదైన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 327, రంగారెడ్డి 195, నల్గొండ 149, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 132, వరంగల్‌ అర్బన్‌ 124, కామారెడ్డి 123, ఖమ్మం 109, కరీంనగర్‌ 107, సిద్దిపేట 103 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61శాతం ఉండగా, దేశంలో 1.68 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 19,53,571 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -