బీజేపీపై యుద్దం ఆపేదిలేదు: కేసీఆర్‌

237
- Advertisement -

టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు.షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చేశారు. పార్టీ శ్రేణులంతా బీజేపీపై యుద్ధం మాత్రం ఆపకండి అని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ఎల్పీ సమావేశంలో… సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో… అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దతతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

వచ్చే జనరల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను మార్చమని తెలిపారు. మళ్లి పాత వారికే టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు. ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌ల స‌మ‌యమే ఉంది. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి. ప్ర‌తి ఎమ్మెల్యే నిత్యం ప్ర‌జ‌ల‌తో మాట్లాడాలి అని సూచించారు. ఏవైనా స‌మ‌స్య‌లుంటే ప్ర‌భుత్వం దృష్టికి తేవాల‌ని కేసీఆర్ సూచించారు. స‌ర్వేల‌న్ని టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వంద శాతం మ‌ళ్లీ టీఆర్ఎస్‌దే అధికార‌మ‌ని తేల్చిచెప్పారు.

మునుగోడు త‌ర‌హాలో ప‌టిష్ట ఎన్నిక‌ల వ్యూహం త‌యారు చేయాల‌ని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగా ప‌ని చేయాలి. అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు. ల‌బ్దిదారుల పూర్తి స‌మాచారం ఎమ్మెల్యేల వ‌ద్ద ఉండాలి. ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌లు నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాలి. ప్ర‌జ‌ల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించాలి. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల బ‌లంతో ఓట‌ర్లంద‌రినీ చేరుకోవాల‌ని కేసీఆర్ సూచించారు.

బీజేపీతో పోరాడాల్సిందేన‌ని కేసీఆర్ చెప్పారు. ప్ర‌భుత్వాల‌ను కూల‌గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌న ద‌గ్గ‌ర కూడా ప్ర‌య‌త్నించి అడ్డంగా దొరికారు. ఆ పార్టీ కుట్ర‌ల‌న్నింటినీ తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తోంద‌ని తెలిపారు. సీబీఐ, ఈడీ దాడుల‌కు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ఇవి కూడా చదవండి..

తెలంగాణకు నేడు విశిష్టమైన దినం:కేటీఆర్‌

8వైద్య కాలేజీలను ప్రారంభించిన సీఎం

కృష్ణ పార్థీవ దేహంకు నివాళులు ఆర్పించిన సీఎం

- Advertisement -