#Mahesh28 బ్రేకులే.. బ్రేకులు!

169
- Advertisement -

ఏ ముహూర్తాన మహేష్ – త్రివిక్రమ్ కాంబో సినిమా ఎనౌన్స్ అయ్యిందో కానీ అప్పటి నుండి షూటింగ్ కి బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఎనౌన్స్ మెంట్ నుండి మొదటి షెడ్యూల్ వరకు చాలా టైం పట్టేసింది షూటింగ్ కి. కనీసం మొదలయ్యాక అయినా జెట్ స్పీడుతో షూటింగ్ జరుగుతుందేమో అనుకుంటే ఫస్ట్ షెడ్యూల్ తర్వాత రెండో షెడ్యుల్ కి లాంగ్ బ్రేక్ పడింది.

ఇటీవల మహేష్ తల్లి ఇందిరా దేవి మరణంతో రెండో షెడ్యూల్ కి భారీ గ్యాప్ వచ్చింది. మహేష్ ఆ బాధ నుండి కోలుకోవడం కోసం ఫ్యామిలీ తో కలిసి ఓ అబ్రాడ్ ట్రిప్ వె ళ్లోచ్చాడు. ఇక ‘Mahesh28’ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్న సందర్భంలో నిర్మాత నాగ వంశీ రెండో షెడ్యూల్ త్వరలోనే మొదలు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

అంతా అనుకున్నట్టు జరిగితే ఈ వారంలోనే సినిమాకు సంబంధించి రెండో షెడ్యుల్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఉన్నపళంగా సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణంతో మళ్లీ షూటింగ్ కి మరో బ్రేక్ పడింది. తండ్రి మరణం నుండి మహేష్ పూర్తిగా కోలుకోవడానికి నెలపైనే పట్టొచ్చు. అంటే అప్పటి వరకు మహేష్ – త్రివిక్రమ్ సినిమాకు పెద్ద బ్రేక్ పడినట్టే. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ షూట్ ఇలా బ్రేకులు , బ్రేకులతో ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో చూడాలి. ఏదేమైనా ఏడాది లోపే మహేష్ తన కుటుంబం లో కీలక సభ్యులను ఒక్కొక్కరిగా కోల్పోవడం ఫ్యాన్స్ ను ఎంతో బాధించే విషయం.

ఇవి కూడా చదవండి..

కృష్ణ..ఒకే హీరోయిన్‌తో 43 సినిమాలు

ఓ శకం ముగిసింది..తరతరాలకు ఆదర్శం వీరు!

పాన్‌ ఇండియా సినిమాలకు కేరాఫ్‌..

- Advertisement -