కేబినెట్‌ లో కీలక నిర్ణయాలు…

202
Telangana Cabinet Meeting Ends
- Advertisement -

ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకి ప్రారంభమైన కేబినెట్‌ మీటింగ్‌ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేటీఆర్, మహేందర్‌రెడ్డి లు మినహా మిగతా మంత్రులంతా హాజరయ్యారు.

etela rajender

సమావేశం అనంతరం మంత్రులు ఈటెల రాజేంధర్‌, హరీష్‌ రావు, జోగురామన్న, కడియం శ్రీహరిలు మీడియాతో మాట్లాడారు. నగరంలో బీసీలకు రూ.70 కోట్లతో 70ఎకరాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఇక ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు మాత్రమే తీసుకున్నట్టు తెలిపారు కడియం శ్రీహరి. త్వరలోనే మరో కేబినెట్‌ భేటీ జరగనుందని, ఆ భేటీలో అన్ని అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇదిలా ఉండగా తాజా కేబినెట్‌ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలను తెలియజేశారు. హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ కోసం మరో 5 ఎకరాలు కేటాయింపు, గోపాల మిత్రులకు వేతనం రూ. 3,500 నుంచి రూ. 8500 పెంపు, అర్చకుల పదవీ విరమణ వయసు 58 నుంచి 65 ఏళ్లకు పెంపు, ఆశా కార్యకర్తల గౌరవ వేతనం రూ. 6 వేల నుంచి 7500లకు పెంచుతూ నిర్ణయం, వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంలుకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలకు పెంపు, ఎన్‌యూహెచ్‌ఎంలో పని చేస్తున్న 9 వేల మందికి కనీస వేతనాలు పెంపు, కాంట్రాక్ట్ డాక్టర్ల వేతనం రూ. 40 వేలకు పెంచినట్లు ప్రకటించారు.

ఇక ముందస్తు ఎన్నికలు, పలు సంక్షేమ పథకాలపై కొంగర్‌కలాన్‌ సభలో సీఎం కేసీఆర్‌ స్పష్టతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -