సీఎం కేసీఆర్‌కు ధన్యావాదములు : మంద జగన్నాథం

52
mandajaganatham
- Advertisement -

ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధిగా నాగ‌ర్‌ క‌ర్నూల్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయ‌కుడు మందా జగ‌న్నాథం బాధ్య‌త‌లు రెండవ సారి స్వీక‌రించారు. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ స‌మ‌క్షంలో జ‌గ‌న్నాథం బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు.

రెండోసారి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా త‌న‌కు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా పనిచేసి రాష్ట్రానికి విరివిగా నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లోని వివిధ ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు త్వరితగతిన వచ్చేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. అంతే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను, పెండింగ్ పనులను కేంద్ర ప్రభుత్వం దగ్గరకు ఎప్పటికప్పుడు తీసుకెళ్లి పరిష్కారంకు ఆహర్నిశలు కృషి చేస్తానని మంద జగ‌న్నాథం చెప్పారు.

- Advertisement -