ప్రధాని మోడీతో రోహిత్ సేన

7
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయింది టీమ్‌ ఇండియా జట్టు. ఉదయం ఐటీసీ మయూర నుంచి బస్సులో బయల్దేరిన రోహిత్‌ సేన.. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ లోని మోడీ ఇంటికి వెళ్లింది. బార్బడోస్‌ నుంచి బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో టీమ్‌ ఇండియా జట్టు గురువారం ఉదయం ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఐటీసీ మయూర హోటల్‌కు వెళ్లిన టీమ్‌.. అక్కడి నుంచి నేరుగా ప్రధానిని కలిసేందుకు వెళ్లింది.

ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బందితో మోడీ అల్పాహార విందు చేశారు. మోడీతో భేటీ అనంతరం ప్రత్యేక విమానంలో టీమ్‌ ఇండియా ముంబైకి బయల్దేరుతుంది. అక్కడ సాయంత్రం విజయోత్సవ ర్యాలీలో పాల్గొననుంది.

ఈ ఆనంద క్షణాలను మేము మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం. మెరైన్‌ డ్రైవ్‌ నుంచి మొదలుకాబోయే విక్టరీ పరేడ్‌లో కలుద్దాం అంటూ రోహిత్‌ శర్మ ట్వీట్‌ చేశాడు.

Also Read:KCR:ప్రజాసమస్యలపై పోరాడండి

- Advertisement -