TDP:సీనియర్లకు నిరాశే

6
- Advertisement -

ఏపీ సీఎంగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తన కేబినెట్‌లో 23 మంది చోటు కల్పించగా సగానికిపైగా మంత్రులు కొత్తవారే ఉన్నారు. ఇక కేబినెట్‌ పదవి ఆశీంచిన సీనియర్లకు నిరాశే ఎదురైంది.

ప్రధానంగా మంత్రి పదవి ఆశీంచిన పరిటాల సునీత, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, యరపతినేని, బొండా ఉమ, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, GV ఆంజనేయులు, కూన రవికి నిరాశే ఎదురైంది.

వైసీపీలో తనకు మంత్రి పదవి ఇవ్వలేదని టీడీపీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి భంగపాటు తప్పలేదు. వైసీపీ నుండి టీడీపీలో చేరిన వారిలో ఆనం రామనారాయణ రెడ్డి,పార్థసారథిలకు మంత్రి పదవులు దక్కాయి.

Also Read:చంద్రబాబు..అనే నేను

- Advertisement -