ఒలింపిక్స్‌లో పథకాలు సాధించిన భారత విజేతలకు శుభాకాంక్షలు..

177
TAUK London
- Advertisement -

లండన్ :టోక్యో ఒలింపిక్స్‌లో పథకాలు సాధించిన భారత క్రీడాకారులకు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) స్పోర్ట్స్ సెక్రటరీ రాకేష్ పటేల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ భారతీయుడు గర్వపడేలా టోక్యో ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తున్నారని, ముఖ్యంగా 41 సంవత్సరాల తరువాత హాకీలో భారత్ పతకం సాధించడం మాకెందరికో సంతోషాన్ని మరియు రాబోయే యువతకు స్ఫూర్తిగా నిలిచిందని వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే పివి సింధు విజయం సైతం భారత ఖ్యాతిని ముఖ్యంగా ఆడపిల్లల్లో నూతన స్ఫూర్తిని నింపిందని రాకేష్ పటేల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. విజేతలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పారితోషికాన్ని అందించి భవిష్యత్తులో వారు మరిన్ని పతకాలు తెచ్చేలా వారికి సరైన శిక్షణ ఇవ్వాలని కోరారు. అలాగే ఆశించిన స్థాయిలో విజయం సాధించని క్రీడాకారులను సైతం ప్రోత్సహించి వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపి రాబోయే రోజుల్లో విజయం సాధించేలా కృషి చెయ్యాలని రాకేష్ పటేల్ క్రీడా సంఘాలని ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -