లండన్‌లో ఘనంగా ‘టాక్ బోనాల జాతర’..

71
- Advertisement -

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 1200 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మరియు ఉపాధ్యక్షులు శ్రీమతి శుష్మణ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన వేడుకలకు, వ్యాఖ్యాతగా సంయుక్త కార్యదర్శి గొట్టిముక్కల సతీష్ రెడ్డి వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హౌంస్లౌ నగర మేయర్ ఆఫ్ఝల్ కియానీ పాల్గొన్నారు.

స్వదేశం లో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల ఊరేగింపు, ముఖ్యంగా పోతురాజు ఆటలు ప్రవాస బిడ్డలనే కాకుండా స్తానికులని కూడా ముగ్దులని చేసింది.లండన్ కి ఉన్నత చదువులకోసం వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం, వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషదారని ధరించి, మన తెలంగాణ సంస్కృతి కోసం బోనాలు ఊరేగింపులో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభను తీసుకొచ్చాడు. పోతురాజు విన్యాసాన్నీ ప్రవాసులే కాక హాజరైన ముఖ్య అతిధులు సైతం ప్రసంశించి సత్కరించారు.

హౌంస్లౌ మేయర్ యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని, లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న నన్ను సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.

Also Read:బీజేపీ లోగోను తొలగించిన ఈటల

, తెలంగాణ రాష్ట్ర పండుగ “బోనాల” వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు లో పాల్గొనడం చాలా సంతోషం గా ఉందని తెలిపారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే,ఎంతో గర్వంగా అనిపించిందని, తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేక సత్కరించి, బహుమతులందజేశారు
. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసికొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని,. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని తెలిపారు.

టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ ,తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచం లో ఉన్నతెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమపథకాల గురించి, బంగారు తెలంగాణ లో ఎన్నారైల పాత్ర గురించి అందరికి గుర్తు చేశారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నపట్టికి, బాద్యత గల తెలంగాణా బిడ్డలు గా ఆనాడు ఉద్యమం లో నేడు పునర్నిర్మాణం లో పోశిస్తున్న పాత్ర ఎందరికో ఆదర్శనంగా ఉందని తెలిపారు. టాక్ సంస్థ బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించి. టాక్ సంస్థని అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవిత గారికి కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం అన్న లేని లోటు వున్నా తన సహకారం, సూచనలు, స్పూర్తి వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నాం అని తేలిపారు.

సంస్థ ఉపాద్యక్షురాలు శుషుమన రెడ్డి మాట్లాడుతూ, టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరు బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపు చేయడం ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు.

ఎన్నారై బీ. ఆర్. యస్ యూకే అధ్యక్షులు మరియు టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ దూసరి గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్ లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందని, , ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు – బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్బంగా అనిల్ కూర్మచలం గారు గత దశబ్ద కాలం తెలంగాణ సంస్కృతిని ఎంత ముందుకు తీసుకువెళ్లారో గుర్తు చేసుకున్నారు. లండన్ లో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియ చేసి వారిని సత్కరించారు.

Also Read:Maharashtra:బస్సులో మంటలు…25 మంది మృతి

ముఖ్యమంత్రి కెసిఆర్ గారు దేశ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలు కోరుకుంటున్నారని , నేడు తెలంగాణ లో జరిగే అభివృద్ధి దేశమంతా అమలు కావాలంటే కేవలం కెసిఆర్ గారి నాయకుడి వల్లే అవుతుందని, “దేశ్ కా నేత కెసిఆర్ ” అంటూ ఎన్నారైలంతా నినదించారు.

కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్పర్సన్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలని ఘనంగా నిర్వహించి తెలంగాణ ప్రగతిని దేశానికి తెలిసేలా చేశారని, అదే స్పూర్తితో, నేడు జాతీయ జెండా ఆవిష్కరించి ప్రవాస తెలంగాణ బిడ్డలంతా కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారన్నారు.

ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన మహా శక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు.

ఈ ఈవెంట్ స్పాన్సర్స్, అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపిక లతో ప్రశంశించారు.టాక్ ముఖ్య నాయకులు జాహ్నవి, హరి గౌడ్ నవపేట్. సత్య చిలుముల, రాకేష్ పటేల్, సత్యపాల్ పింగిళి, శ్రీకాంత్, క్రాంతి మాట్లాడుతూ బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషం గా ఉందని తెలిపారు.ఇతర ఎన్నారై సంఘాల యూకే ప్రతినిధులు వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు.

ఈ కార్యక్రమంలో అద్యక్షులు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, సత్య చిలుముల, అడ్వైసరీ చైర్మన్ మట్టా రెడ్డి సభ్యులు, కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్పర్సన్ నవీన్ రెడ్డి,సత్య చిలుముల, మల్లా రెడ్డి బీరం , రాకేష్ పటేల్ ,సత్య పింగిళి, హరి నవపేట్ , వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి , శ్వేతా మహేందర్ , రవి రేతినేని ,గొట్టిముక్కల సతీష్ రెడ్డి,రవి పులుసు,గణేష్ కుప్పలా , శ్రీకాంత్ జెల్లా,మధుసూదన్ రెడ్డి ,రాజేష్ వాకా,శ్రీవిద్య ,శ్రావ్య ,భూషణ్ ఉప్పల ,మౌనిక డూడ్ల్,రంజిత్ ,విజిత ,శ్రీధర్ రావు ,గణేష్ పస్తం,శశి ,అవినాష్, తేజా తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

- Advertisement -