తనుశ్రీకి పిచ్చి పట్టింది-రాఖీ సావంత్

291
- Advertisement -

ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ చేస్తున్న ఆరోపణలను బాలీవుడ్ శృంగార తార రాఖీ సావంత్ ఖండించింది. ఈ క్రమంలో రాఖీ సాంవంత్‌పై తనుశ్రీ పరువు నష్టం దావా వేసింది. అయితే కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా ప్రవర్తిస్తుందని రాఖీ విమర్శించింది. దాదాపు పదేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఇటీవల తనుశ్రీ తెలిపింది. ఆ సినిమా కోసం చేస్తున్న స్పెషల్ లో ఆయన తన చేయి కూడా లాగారని ఆరోపించింది.

ఈ క్రమంలో పాట నుంచి తప్పుకున్నందుకు పటేకర్ అనుచరులు ఆమెపై దాడికి యత్నించారు. అనంతరం జరిగిన పరిణామాల కారణంగా తనుశ్రీ నటించాల్సిన స్పెషల్ సాంగ్‌లో రాఖీ నటించింది. అయితే, నానా పటేకర్‌పై తనుశ్రీ చేసే ఆరోపణన్నీ అబద్దాలేనని.. ఆమెకు పిచ్చి పట్టిందని.. గత పదేళ్లుగా తనుశ్రీ కోమాలో ఉండి, ఈ మధ్య కోమా నుంచి బయటపడిందని రాఖీ సావంత్ ఎద్దెవా చేసింది.

పదేళ్లు అమెరికాలో గడిపి, ఇప్పుడు పబ్లిసిటీ కోసం పటేకర్‌పై ఆరోపణలు చేస్తోందని.. అమెరికా నుంచి వచ్చాక.. అవకాశాలు లేక.. డబ్బుల కోసం ఆమె లాంటి వ్యాఖ్యలు చేస్తోందని రాఖీ సాంవంత్ మండిపడింది. ఇక రాఖీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తనుశ్రీ.. ఆమెపై రూ. 10 కోట్ల పరువునష్టం దావా వేసింది. తనుశ్రీ ఇమేజ్‌ను దెబ్బతీసేలా మాట్లాడిన రాఖీ సాంవత్‌పై క్రిమినల్ కేసు పెట్టామని తనుశ్రీ తరపు లాయర్ తెలిపారు.

- Advertisement -