శృతి ఆరోపణల్లో వాస్తవం లేదు- ఐశ్వర్య

284
- Advertisement -

హీరో అర్జున్‌పై నటి శృతి హరిహరన్‌ చేసిన ఆరోపణలను ఆయన కుమార్తె ఐశ్వర్య కొట్టిపారేశారు. అర్జున్ పై ఆరోపణలు చేసి పబ్లిసిటీ పెంచుకోవడానికే శృతి హరిహరన్ ఇలాంటి తప్పుడు స్టేట్‌మెంట్‌లు ఇస్తోందని తెలిపింది. రొమాంటిక్ సీన్లు రిహార్సల్ చేసే సమయంలో ఇబ్బంది ఉన్నప్పుడు అప్పుడే చెప్పాల్సిందని తెలిపింది. ఆ సినిమాలో శృతి కేవలం ఐదు రోజులే నటించిందని ఆ సమయంలో మా నాన్న ఆమెను రిసార్టుకు పిలిచాడు, డిన్నర్‌కు పిలిచాడు అంటోందని కానీ అలాంటి చోట్లకు ఆయన అసలు వెళ్లరని… పబ్బుకు వెళ్లడం కూడా తాను ఇంతవరకు చూడలేదని ఐశ్వర్యం స్పష్టం చేసింది.

తాను కూడా ఓ నటినేనని, ఇప్పుడిప్పుడే నటన నేర్చుకుంటున్నానని. పెద్ద నటులతో కలిసి వర్క్ షాపులో పాల్గొన్నాను. సినిమా షూటింగ్స్, రొమాంటిక్ సీన్స్ రిహార్సల్స్ ఎలా జరుగుతాయో నాకు తెలుసని తెలిపింది..

విస్మయ సినిమా గురించి మా కుటుంబ సభ్యులతో కూడా ఆయన చర్చించేవారని ఆ స్క్రిప్టులో కొన్ని రొమాంటిక్ సీన్లు ఇబ్బంది పడే విధంగా ఉంటే వాటిని తొలగించేస్తేనే నటిస్తాను అని దర్శకుడికి చెప్పాడు. ఈవిషయం శృతి హరిహరన్‌కు కూడా తెలుసు అని ఐశ్వర్య చెప్పారు.

శృతి చేస్తున్న ఆరోపణలను ఎవరు నమ్మరని ఆయన వ్యక్తిత్వం గురించి అందరికి తెలుసన్నారు. మీటూ ఉద్యమానికి ఎప్పుడూ మద్దతు ఉంటుందని కానీ ఆ పేరుతో మంచివారిపై బురద చల్లడం సరికాదన్నారు.

విస్మయ (తెలుగులో ‘కురుక్షేత్రం’) సినిమా సమయంలో ఓ రొమాంటిక్ సీన్ రిహార్సల్స్ సందర్భంగా అర్జున్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తన శరీరాన్ని అసభ్యంగా టచ్ చేశాడంటూ శృతి హరిహరన్ చేసిన ఆరోపణలు సౌత్ ఇండిస్ట్రీలో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో అర్జున్‌..శృతి చేసిన ఆరోపణలను ఖండించారు. ఆ సినిమా దర్శకుడు అరుణ్ సైతం శృతి ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపిన సంగతి తెలిసిందే.

- Advertisement -