బీజేపీ నేత రాంమాధవ్‌కు ఎంపీ వినోద్ కౌంటర్

248
-Vinod-Kumar
- Advertisement -

తెలంగాణపై బీజేపీ నేత రాంమాధవ్ చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఖండించారు. తెలంగాణపై రాంమాధవ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పలువురు కేంద్రమంత్రులు మెచ్చుకున్నారని వినోద్ స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ పాలనకు పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రశంసించారని చెప్పారు.

ప్రాంతీయ పార్టీల ఎదుగుదలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని.. ప్రాంతీయ పార్టీలను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వినోద్ మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి ఉందంటూ రాంమాధవ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని.. చంద్రబాబు అవినీతి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే రాహుల్ మాత్రం ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని.. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో తప్పకుండా గులాబి పార్టీదే విజయమని.. టీఆర్ఎస్‌పై, కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ఊరుకోబోమని వినోద్ హెచ్చరించారు.

- Advertisement -