- Advertisement -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఈడీ ముందుకు రానున్నారు నటుడు తనీష్. డ్రగ్స్ హబ్ గా మారిన ఎఫ్ లాంజ్ పబ్ వివరాలు ఏమన్నా తెలుసా ? అన్న కోణంలో తనీష్ ని ఈడీ విచారించనుంది.
2017 డ్రగ్ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నోటీసులు అందుకున్న పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ముమైత్ ఖాన్, నవదీప్ విచారణకు హాజరయ్యారు. మరో వైపు ప్రధాన నిందితుడు కాల్విన్ మస్కరేన్హాస్ తో పాటు మరో ఇద్దరు నిందితులు అబ్దుల్ వాహెద్, అబ్దుల్ ఖుద్దూస్ని కూడా ఈడీ అధికారులు విచారించారు.
- Advertisement -