మొక్కలు నాటిన సినీ నటుడు తనికెళ్ళ భరణి..

195
tanikella barani
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన నివాసంలో మొక్కలు నాటిన సినీ నటుడు తనికెళ్ళ భరణి….అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు హరిత యజ్ఞం రూపంలో మళ్ళీ మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు దేశ వ్యాప్తంగా విస్తరించి ముందుకు తీసుకెళ్తున్నారని సినీ నటుడు తనికెళ్ళ భరణి అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ శ్రీనగర్ కాలనీ లోని తన నివాసంలో లో మొక్కలు నాటిన సినీ నటుడు తనికెళ్ళ భరణి.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నానని తెలిపారు.అనంతరం మరో నలుగురు ( సుహాసినిమణిరత్నం , డైరెక్టర్ త్రివిక్రమ్ , సినీ నటులు నాజర్ , ప్రకాష్ రాజ్ ) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని తనికెళ్ళ భరణి పిలుపునిచ్చారు.

- Advertisement -