తండ్రి కాబోతున్న కోహ్లీ!

262
- Advertisement -

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తన భార్య అనుష్కతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ త్వరలో మేం ముగ్గురం కాబోతున్నాం అని తెలిపారు.

2021లో పండంటి బిడ్డ మా ఇంట్లో అడుగుపెట్ట‌నున్నారు అని విరాట్ తెలపగా కోహ్లీ షేర్ చేసిన ఫోటోలో అనుష్క బేబి బంప్‌తో క‌నిపిస్తుంది. 2017లో ఇటలీ వేదిక‌గా విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మలు మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టయ్యారు. విరాట్ ట్వీట్ చేసిన కొద్దిసేపట్లోనే అభిమానులు, సెల‌బ్రిటీలు ఈ దంప‌తుల‌కి శుభాకాంక్ష‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

అనుష్క శ‌ర్మ 2008లో వచ్చిన రబ్‌ నే బనా దీ జోడీ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత స్టార్‌ హీరోలతో న‌టిస్తూ బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్లలో అనుష్క శర్మ టాప్‌ ప్లేస్‌లో ఉంది.

- Advertisement -