సిద్దిపేట నమూనాగా గొర్రెల షెడ్ల నిర్మాణం: తలసాని

144
talasani
- Advertisement -

సిద్దిపేట నమూనాగా అన్ని జిల్లాలలో గొర్రెల షేడ్ లు నిర్మిస్తాం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ లో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి హరీష్ రావు చేప పిల్లలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి తలసాని….రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తాం అన్నారు. డీడీలు కట్టిన వారందరికీ గొర్రెలను పంపిణీ చేస్తాం. పాడిపై ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతాం అన్నారు. నరేగా కింద అర్హులైన వారందరికీ పశువుల, గొర్రెల షేడ్ లను మంజూరు చేస్తాం అని తెలిపారు.

- Advertisement -