పేద పురోహితుడిని ఆదుకున్న మంత్రి తలసాని

218
talasani
- Advertisement -

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పనిలేక పస్తులుండాల్సిన పరిస్ధితి నెలకొంది. హైదరాబాద్ సనత్ నగర్‌లో ఓ పురోహితుడు వాహనదారుల నుండి యాచిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఓ పత్రికలో సైతం ఇందుకు సంబంధించిన వార్త రాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే స్పందించారు.

ఆ పురోహితుడి వివరాలను సేకరించిన తలసాని..నెల రోజులకు సరిపడా బియ్యం, మంచినూనె, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులతో పాటు రూ.2,000ల నగదును అందజేశారు. దీంతో వారు ఆనందం వ్యకం చేస్తున్నారు.

- Advertisement -