కేసీఆరే సీఎం కావాలి..ఆంధ్రా యువకుడి పాదయాత్ర

208
Now Andhra peolpe likes KCR
- Advertisement -

బంగారు తెలంగాణ పునర్‌ నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ,పలువురు కేంద్రమంత్రులు,వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,మాజీ సీఎంలు కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను కొనియాడారు.

రైతుబంధు, కళ్యాణ లక్ష్మీ, మిషన్ భగీరథ లాంటి సంక్షేమ పథకాలతో కేసీఆర్‌కు ఆంధ్రలోనూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. పలు సందర్భాల్లో కేసీఆర్ ఫ్లెక్సీలు ఆంధ్రాలో సైతం దర్శనమిచ్చాయి. తాజాగా ఓ ఆంధ్ర యువకుడు కేసీఆర్‌పై తన అభిమానం చాటుకున్నారు.

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ ఏపీకి చెందిన రోహిత్ కుమార్ రెడ్డి విజయవాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేపట్టాడు. నెల్లూరుకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ జెండాతో గులాబీ దుస్తుల్లో కాలినడకన హైదరాబాద్ బయల్దేరాడు. కేటీఆర్‌ను విపరీతంగా అభిమానించే రోహిత్ తన గుండెలపై ఆయన టాటూను వేయించుకున్నారు.

ఈ నేపథ్యంలో రోహిత్ చూపించిన ప్రేమ,ఆదరాభిమానాలకు ఫిదా అయ్యారు కేటీఆర్. కేసీఆర్,టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు నిలిచినందుకు థాంక్స్ చెప్పారు.

- Advertisement -