వివాదంలో సురేశ్ రైనా.. నెటిజన్ల విమర్శలు..

177
raina
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ సురేశ్ రైనా వివాదంలో ఇరుక్కున్నాడు. రైనా చేసిన కామెంట్స్‌ అతన్ని వివాదాల్లోకి నెట్టేసింది. ప్రస్తుతం త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్ (టీఎన్‌పీఎల్‌)కు రైనా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మ్యాచ్‌ సందర్భంగా కామెంట్రీ ఇస్తూ అక్కడి సంస్కృతిపై మాట్లాడుతూ నోరు జారాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్‌కేతోనే ఉన్న రైనాను తమిళ సంస్కృతి గురించి చెప్పమని సహచర కామెంటేటర్ అడిగాడు.

ఈ నేపథ్యంలో రైనా స్పందిస్తూ… ‘నేను కూడా బ్రహ్మిణే అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నైకి ఆడుతున్నా. నా టీమ్ మేట్లను, తమిళనాడు సంస్కృతిని ఎంతో ఇష్టపడుతున్నా’ అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తమిళనాడు అంటే కేవలం బ్రాహ్మణులే ఉంటారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇన్నేళ్ల నుంచి చెన్నైకి ఆడుతున్నప్పటికీ… ఇక్కడి నిజమైన సంస్కృతిని చూసినట్టు లేవని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రైనా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

- Advertisement -