సుడిగాలి సుధీర్‌‌కు బంపరాఫర్..!

230
sudeer
- Advertisement -

సుడిగాలి సుధీర్..ఇప్పుడు బుల్లితెరపై ఈ పేరు ఓ బ్రాండ్..జబర్దస్త్‌ షోలో కమేడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ , ఢీ షో లో మెంటర్‌గా, పలు రియాలిటీ షోలలో తనదైన యాక్టింగ్‌, యాంకరింగ్‌తో పాపులర్ స్టార్ అయ్యాడు. యాక్టింగ్, డ్యాన్సింగ్, కామెడీలో తనదైన మార్క్ చూపించే సుడిగాలి సుధీర్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ ఉంది. ముఖ్యంగా ఆన్‌స్క్రీన్‌పై డస్కీబ్యూటీ రష్మీతో పండించే రొమాన్స్, వారిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీతో సుధీర్ ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్‌ను గమనించిన బిగ్‌బాస్‌ యాజమాన్యం సీజన్ – 5 లో కంటెస్టెంట్‌గా తీసుకువస్తోంది. గత నాలుగు సీజన్లు ఒకదానికి మించి సూపర్‌హిట్ అవడంతో బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్‌ సీజన్ – 5 ను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈక్రమంలో టాప్ సెలబ్రిటీలతో చర్చలు కూడా జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.

తాజాగా షో నిర్వహకులు జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారంటూ ఓ న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లాస్ట్ సీజన్‌లోనే సుడిగాలి సుధీర్‌, యాంకర్ రష్మీలు పార్టిస్పేట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాని అప్పుడు వర్కవుట్ కావడం లేదు. అయితే తాజాగా బిగ్‌బాస్ – 5 లో మాత్రం సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈమేరకు సుధీర్‌తో బిగ్ బాస్ నిర్వాహకులు ఫోన్‌లో సంప్రదింపులు జరిపారట. ఆ సమయంలో బిగ్ బాస్ యూనిట్ సుధీర్‌కు ఏకంగా రూ. 4.50 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఆఫర్ చేసిందని వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

ఇప్పటి వరకూ ఇండియాలోని ఏ బుల్లితెర ఆర్టిస్ట్‌కు ఇంత అమౌంట్ ఇవ్వలేదు. అంతెందుకు బిగ్‌బాస్‌ షోలో ఏ భాషలో కూడా ఏ కంటెస్టెంట్‌కు ఇంత ఆఫర్ చేయలేదు. ఈ ఆఫర్ తెలుగులో బిగ్ బాస్ హోస్టుగా చేసిన నేచురల్ స్టార్ నాని తీసుకున్న మొత్తానికి సమానం. అయితే సుడిగాలి సుధీర్‌ బిగ్‌బాస్ – 5 యాజమాన్యం ఇచ్చిన భారీ ఆఫర్‌‌ను ఒప్పుకున్నాడా..షోలో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? లేదా? అన్నది మాత్రం ఇంకా తెలియాల్సింది. ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్‌కు నాలుగున్నర కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారన్నది అంత నమ్మబుల్‌గా లేదని కొందరు అంటున్నారు. మొత్తంగా బిగ్‌బాస్‌ – 5 లో కంటెస్టెంట్‌‌‌గా పాల్గొనేందుకుగాను సుడిగాలి సుధీర్‌కు బిగ్‌బాస్ నాలుగున్నర కోట్లు ఇస్తున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

- Advertisement -