బంగారు నాణెలు కానుకగా ఇచ్చిన స్టార్‌ హీరో..

270
Simbu
- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో శింబు వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటాడు. కాని ఈ సారి ఆయన ఓ మంచి పనితో అందరి మనసులు గెలుచుకున్నారు శింబు. ఈ యువ హీరో తాజాగా తన కొత్త చిత్రం కోసం పనిచేసిన యూనిట్ సభ్యులు, జూనియర్ ఆర్టిస్టులకు దీపావళి సందర్భంగా కానుకలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. శింబు ప్రస్తుతం ‘ఈశ్వరన్’ అనే చిత్రంలో నటించాడు. సుశీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విలేజ్ నేటివిటీతో తెరకెక్కుతోంది.

మరికొన్నిరోజుల్లో దీపావళి వస్తుండడంతో శింబు తన యూనిట్ సభ్యులను సర్ ప్రైజ్ చేశాడు. ‘ఈశ్వరన్’ చిత్రం కోసం పనిచేస్తున్న 400 మందికి ఒక గ్రాము బంగారు నాణెం కానుకగా ఇచ్చాడు. 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు కొత్త దుస్తులు అందజేశాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ చిత్రం తమిళ తెలుగు భాషాలతో పాటు కన్నడ, మలయాళ, హిందీలోనూ విడుదల కానుంది.

- Advertisement -