మంచి మనసు చాటుకున్న కేసీఆర్ సతీమణి..

313
kcr wife shoba
- Advertisement -

సీఎం కేసీఆర్ సతీమణి శోభ తమ మంచి మనసు చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కమటం తిరుపతి అనారోగ్యంతో చనిపోయారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పని చేసి కుటుంబ పోషణ సాగిస్తున్నారు. అతని భార్యకు మూడు ఆపరేషన్లు చేశారు. తల్లిదండ్రులు పని చేయలేని పరిస్థితి. ఉన్న ఇల్లు మొన్నటి వర్షాలకు కూలడంతో నూతన గృహ నిర్మాణం మొదలు పెట్టారు. ఇంతలో తిరుపతి అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబ వీధి పాలైంది. ఉండటానికి ఇల్లు లేక గ్రామంలో మున్నూరు కాపు కులసంఘ భవనంలో నివాసం ఉంటున్నారు. వారి దీన స్థితి గురించి మీడియాలో రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ చూసి చలించిపోయారు.

తన వంతు సహాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ఫోన్ చేసి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయాలని సూచించారు.ఆ సాయాన్ని చొప్పదండి శాసనసభ్యుడు రవిశంకర్ ద్వారా బాధితులకు అందించారు. అటు, ఇతరులు కూడా ఆర్థికసాయం చేయగా మొత్తం మూడు లక్షల రూపాయలు అయ్యాయి. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే రవిశంకర్ తిరుపతి కుటుంబ సభ్యులకు అందించారు. వారికి ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్ రూం ఇల్లు, పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -