కథ వినగానే…పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది:నితిన్

751
nithin rashi khanna
- Advertisement -

శ్రీనివాస కల్యాణం కథ వినగానే పెళ్లి చేసుకోవాలనిపించిందని హీరో నితిన్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో శ్రీనివాస కల్యాణం ఆడియో వేడుక అతిరథ మహారథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన నితిన్…కొన్నేళ్లుగా మా అమ్మ పెళ్లిచేయాలని ప్రయత్నిస్తోందని కానీ నాకు ఇప్పుడు చేసుకునే ఉద్దేశం లేదని చెప్పానని…కానీ సతీష్ వేగేశ్న చెప్పిన కథ వినగానే పెళ్లిపై క్లారిటీ వచ్చేసిందన్నారు. సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని…మిక్కీ మంచి పాటలు అందించారని తెలిపారు నితిన్.

Srinivas Kalyanam Audio Launch

41 సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో వేడుకల్ని చూశానని..కానీ ఎప్పుడు కుటుంబంతో కలిసి ఓ సినిమా వేడుకకి వెళ్లలేదని ఇదే తొలిసారని తెలిపారు నటుడు రాజేంద్రప్రసాద్. శతమానం భవతి తర్వాత మళ్లీ ఒక మంచి చిత్రాన్ని ఆగస్టు 9న సినిమా ప్రేక్షకుల ముందుకువస్తుందని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

నితిన్‌తో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని…కా కెరీర్‌లో ఉత్తమమైన సినిమా గుర్తుండిపోతుందని హీరోయిన్ రాశీ ఖన్నా తెలిపింది. కథ చెప్పినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని.. విలువలున్న ఈ చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని తెలిపింది.

prakash raj jayasudha

పెళ్లిళ్ల గురించి డాక్యుమెంటరీ కాదు. ఈ సినిమా ఒక మంచి అనుభూతిగా మిగిలిపోతుందని ప్రకాష్ రాజ్ తెలిపారు. ‘బొమ్మరిల్లు’ సినిమాతో దిల్ రాజుతో నా ప్రయాణం మొదలైందని… రామానాయుడు తర్వాత మంచి సినిమాలను తెరకెక్కించే నిర్మాతగా దిల్ రాజు పేరు తెచ్చుకున్నారని తెలిపారు.

- Advertisement -