టీఆర్ఎస్‌లో చేరిన శ్రీధర్ రెడ్డి..

160
sridhar
- Advertisement -

టీఆర్ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీజేపీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మక్షంలో బీజేపీ నాయ‌కుడు రావుల శ్రీధ‌ర్ రెడ్డి గులాబీ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా శ్రీధ‌ర్ రెడ్డికి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

శ్రీధ‌ర్ రెడ్డితో పాటు వంద‌లాది మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, శ్రీనివాస్ గౌడ్‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

- Advertisement -