ధరణి…సేవలు ప్రారంభం

206
somesh kumar
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల సేవ‌ల‌ను శంషాబాద్ తాసిల్దార్ కార్యాల‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉద‌యం లాంఛ‌న‌గంగా ప్రారంభించారు.

హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధ‌ర‌ణి సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని తెలిపారు సోమేశ్‌ కుమార్. ఇప్పటివరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించి 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం అయ్యాయ‌ని తెలిపారు.

ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని….ఇవాళ 946 మంది రిజిస్ర్టేష‌న్ల కోసం న‌గ‌దు చెల్లించారు. 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నార‌ని వెల్లడించారు. గత నెల 29న సీఎం కేసీఆర్‌ పోర్టల్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మాత్రమే జరుగనున్నాయి.

- Advertisement -