టీఆర్ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి: శ్రీధర్ రెడ్డి

290
trs
- Advertisement -

సీఎం కేసీఆర్,టీఆర్ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు రావుల శ్రీధర్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన శ్రీధర్ రెడ్డి….తెలంగాణ రాష్ర్ట భ‌విష్య‌త్ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు చేతిలోనే భ‌ద్రంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

దేశంలో, రాష్ర్టంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప‌రిశీలించాక టీఆర్ఎస్ పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపిన శ్రీధర్ రెడ్డి… కేసీఆర్, కేటీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ‌తో పాటు హైద‌రాబాద్ బాగా అభివృద్ధి చెందింద‌న్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయ‌మ‌ని …. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి తీరుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో గ‌త ఫ‌లితం పునరావృతం కాబోతుంద‌న్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ నాయ‌క‌త్వంలో త‌న‌కున్న అనుభ‌వాన్ని, శ‌క్తియుక్తుల‌ను టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఉప‌యోగిస్తాను అని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -