శ్రీదేవి బయోగ్రఫీ.. జాన్వీ క్లారిటీ

11
- Advertisement -

అతిలోక సుందరి శ్రీదేవి అందాల తనయ జాన్వీ కపూర్ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. అలాగే జాన్వీ ఏం కామెంట్స్ చేసినా అవి క్షణాల్లోనే వైరల్ అవుతాయి. తనపై వస్తున్న ట్రోల్స్ ను పట్టించుకోవడమే మానేశానని అందాల జాన్వీ కపూర్ తెలిపింది. మొదట్లో తన గురించి నెటిజన్స్ చేస్తున్న ట్రోల్స్ చూసి చాలా బాధపడేదాన్నని, కానీ ఇప్పుడు వాటిని చూస్తుంటే తనకు నవ్వొస్తుందని జాన్వీ పేర్కొంది. ట్రోల్స్ చేసేవారికి అదే ఆనందం. వారి విమర్శలతోనే మనం వార్తల్లో నిలుస్తాం అని వివరించింది. మొత్తానికి జాన్వీ కపూర్ లో చాలా మార్పులు వచ్చాయి.

అలాగే జాన్వీ కపూర్ తన తల్లి గురించి చెబుతూ.. భారతీయ సినిమా అతిపెద్ద మహిళా సూపర్ స్టార్ గా మా అమ్మ ఓ వెలుగు వెలిగింది అని అందరూ చెబుతూ ఉంటే.. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మ అభిమానులకు ఓ శుభవార్త. ఆ అతిలోక సుందరి శ్రీదేవి బయోగ్రఫీ పుస్తకం రూపంలో అందుబాటులోకి రానుంది. ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో ఈ పుస్తకాన్ని త్వరలో మార్కెట్ లో విడుదల చేయనున్నట్లు జాన్వీ కపూర్ వెల్లడించింది. రచయిత ధీరజ్ కుమార్ ఈ పుస్తకాన్ని రాయగా.. దీని హక్కులను వెస్ట్యండ్ బుక్స్ సంస్థ స్వంతం చేసుకుంది. మొత్తానికి త్వరలోనే శ్రీదేవి బయోగ్రఫీ లాంఛ్ కాబోతుంది.

ఇక జాన్వీ కపూర్ తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇవి కూడా చదవండి…

18యేళ్లు..మహేష్ నమ్రత వివాహాబంధం

వైట్ స్కీన్‌ సర్జరీ చేయించుకోలేదు:కాజోల్

నటనలో పోటీ వల్ల కొంత భయపడ్డ:చరణ్‌

- Advertisement -