కవిత..ఆలయంలో ప్రత్యేక పూజలు

39
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెన్నై పర్యటనలో భాగంగా… నటుడు అర్జున్ సార్జా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అంతకుముందు అర్జున్‌ దంపతులు ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం పలికారు. అనంతరం కలిసి ఆలయంను సందర్శించారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొననున్నారు. 2024 ఎన్నికలు-ఎవరు విజయం సాధిస్తారు?అనే అంశంపై జరిగే చర్చ వేదికలో ప్రసంగించనున్నారు.

ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ… చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, ఇక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు. తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి, భాష, చరిత్ర, వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవ భావం ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్ కు కవిత అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

లడ్ఢాఖ్‌లో లిథియం నిల్వలు…

మార్చిలో జీఎస్ఎల్వీ మార్క్‌-3..

- Advertisement -