స్పీడ్‌ పెంచిన సీనియర్‌ బ్యూటి..

222
Sridevi and Sanjay dutt to Reunite Twenty-five years later
- Advertisement -

శ్రీదేవి ద‌క్షిణాదినే కాదు, ఉత్త‌రాది చ‌ల‌న చిత్ర రంగంలో కూడా సూప‌ర్‌స్టార్ స్టేట‌స్‌తో రాణించిన తొలి హీరోయిన్‌. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి చాలా కాలం తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ అంటూ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మంచి కథ కోసం ఎదురుచూసిన శ్రీదేవి తాజాగా మామ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీనియర్ భామ నటించిన 300వ సినిమాగా వచ్చిన మామ్. థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది. ఇప్పుడు శ్రీదేవి వరుస చిత్రాలతో మంచి స్పీడ్‌ మీద ఉంది. ఈ అతిలోక సుందరి మరుసటి ప్రాజెక్ట్ కూడా ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. తన మరుసటి చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌లో చేయనుందట శ్రీదేవి

Sridevi and Sanjay dutt to Reunite Twenty-five years later

అయితే ఈ మూవీ విభజనకు సంబంధించిన కథపై అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది.ఇంత ముందు కరణ్ జోహార్ సంస్థలోనే 2 స్టేట్స్ అంటూ మంచి హిట్ సాధించిన ఈ దర్శకుడు.. ఇప్పుడు మళ్లీ భారీ తారాగణంతో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఇప్పటికే సోనాక్షి సిన్హా ,వరుణ్ ధావన్, ఆలియా భట్‌లు భాగం కాగా ఈ మూవీ కోసం సంజయ్ దత్ ను కూడా అప్రోచ్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు తాజా వినిపిస్తున్న వార్త ఎంటంటే సంజయ్ దత్-శ్రీదేవి ఈ చిత్రంలో జంటగా నటించనున్నారని అంటున్నారు.

Sridevi and Sanjay dutt to Reunite Twenty-five years later

సంజయ్ దత్- శ్రీదేవి కలిసి దాదాపు పాతికేళ్ల క్రితం గుమ్రాహ్ చిత్రంలో నటించారు. అయితే ఈ గుమ్రాహ్ మూవీ కూడా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే రూపొందడం యాదృచ్ఛికమే. వీరిద్దరు మళ్లీ ఇన్నేళ్లకు జంటగా నటించడం విశేషం . అయితే శ్రీదేవి మాత్రం తన సినిమాల స్పీడ్ ను పెంచే ఉద్దేశ్యంలో ఉందనే సంగతి అర్ధమవుతోంది. మరి ఈ ప్రాజెక్ట్‌ ఎప్పటికి మొదలౌతుందో చూడాలి.

- Advertisement -