21వ కళాసుధ ఉగాది ఫిల్మ్ అవార్డుల వేడుక..

322
Sri Kala Sudha Telugu Awards 2019
- Advertisement -

గత 20 సంవత్సరాలుగా చెన్నై నగరంలో శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సినిమా అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఉగాది సందర్బంగా 21 వ ఉగాది పురస్కారాలు పేరుతో అవార్డులు అందించనున్నారు. ఈ సందర్బంగా కర్టైన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో గురువారం జరిగింది. ప్రముఖ సీనియర్ దర్శకులు సాగర్ ఉగాది పురస్కారాల బ్రోచర్‌ను విడుదల చేసి నిర్మాత మోహన్ వడ్లపట్ల కు అందచేశారు. ఈ అవార్డుల వేడుక ఈ నెల 7 ఆదివారం రోజున జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కళాసుధ ప్రసిడెంట్ బేతిరెడ్డి శ్రీనివాస్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా దర్శకుడు సాగర్ మాట్లాడుతూ .. గత 20 సంవత్సరాలుగా కళాసుధ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం. నిజంగా ఇలాంటి మంచి పని చేస్తున్న శ్రీనివాస్‌ని ఈ కమిటీని అభినందిస్తున్నాను. అన్ని పనులు డబ్బు కోసం చేయరు. కొన్ని పనులు సంతృప్తి కి కోసం చేస్తారు, ఇది అలాంటిదే. ఈ ఏడాది అవార్డులు అందుకుంటున్న వారిని అభినందిస్తున్నాను. చెన్నైలో తెలుగు వాళ్ళ సత్తా చాటేలా ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహిస్తున్న వారిని అభినందిస్తున్నాను అన్నారు.

నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. నేను కూడా పదేళ్ల క్రితం కలవరమాయే మదిలో సినిమాకు గాను ఈ అవార్డును అందుకున్నాను. శ్రీనివాస్ ఆధ్వర్యంలో చెన్నైలో ఈ వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ సారి సినిమా తారలందరూ పాల్గొని కార్యక్రాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు.

బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ఇరవై ఏళ్లుగా కళాసుధ పేరుతో ఈ అవార్డు వేడుకలను నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఉగాది సందర్బంగా సినిమా తరాలకు అవార్డులతో సత్కరిస్తున్నాం. సినిమా వాళ్ళ ప్రోత్సహం కూడా ఎంతో ఉంది. ఈ ఎప్పటిలాగే ఈ ఏడాది చెన్నై లోని మ్యూజిక్ అకాడమీలో ఈ వేడుక జరుగుతుంది. అందరు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుకుంటున్నా అన్నారు. చెన్నైలో 7 ఆదివారం రోజున సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉగాది అవార్డులతో పాటు మహిళా రత్న పురస్కారాలు కూడా అందచేస్తారు.

- Advertisement -