వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలిః మంత్రి ఈటెల

300
Etela rajendar
- Advertisement -

కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి ఈటెల రాజేందర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోహెడ లో జరిగిన రోడ్ షో లో మంత్రి ఈటెల పాల్గోన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ కు లాభం, బిజేపి గెలిస్తే మోడీ లాభం.. కానీ టిఆర్ఎస్ గెలిస్తే యావత్ తెలంగాణ కు లాభం జరుగుతుందన్నారు.

గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కరెంట్ కోతలు, సాగు నీళ్లు, త్రాగు నీళ్లకు ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మెట్ట ప్రాంతాలకు సైతం నీరందించిన ఘనత సీఎం కేసీఆర్ దన్నారు. వర్షాకాలం వరకూ ప్రాజెక్ట్ లు పూర్తయి, సాగు నీళ్లు అందే అవకాశం ఉందన్నారు. ఈ సభలో ఎంఎల్ఏ సతీష్ కుమార్ మరియు కోహెడ మండల టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -