సభ ప్రారంభానికి ముందే కరోనా పరీక్షలు: స్పీకర్

311
pocharam
- Advertisement -

శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగుతున్న నేపద్యంలో అందరి శ్రేయస్సు దృష్ట్యా శాసనసభ, శాసన మండలి సభ్యులు సెప్టెంబర్ 14, 2020 (సోమవారం)న సభ ప్రారంభానికి ముందే కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున అందరి క్షేమం దృష్ట్యా మంత్రులు, శాసనసభ్యులు, మండలి సభ్యులు సోమవారం ఉదయం 9 గంటల లోపు శాసనసభ భవనం, శాసనమండలి భవనాలలో వైద్య, ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ లలో కరోనా టెస్ట్ లను చేయించుకోవాలని స్పీకర్ పోచారం, చైర్మన్ గుత్తా విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా అసెంబ్లీ మరియు కౌన్సిల్ సిబ్బంది, మార్షల్స్, మీడియా రిపోర్టర్లు మరియు సమావేశాల కోసం బందోబస్తుకై కేటాయించిన పోలీసు సిబ్బందికి కూడా కరోనా టెస్ట్ లు చేయించాలని స్పీకర్ పోచారం, చైర్మన్ గుత్తా లేజిస్లేటివ్ సెక్రటరీ వి. నరసింహ చార్యులని ఆదేశించారు. ఈ సిబ్బందికి రేపు సాయంత్రం (సెప్టెంబర్ 13, 2020) అసెంబ్లీ, కౌన్సిల్ ప్రాంగణాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందరికి టెస్ట్ లను నిర్వహిస్తారు. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అందరు కూడా తప్పనిసరిగా టెస్ట్ లు చేయించుకోవాలని స్పీకర్ మరియు చైర్మన్ ఆదేశించారు. కరోనా నేపద్యంలో అందరూ ఈ టేస్ట్ లను చేయించుకుని సహకరించగలరని స్పీకర్ పోచారం, చైర్మన్ గుత్తా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -