బాత్రూంలో వచ్చే మూర్ఛ గురించి తెలుసుకుందాం…

359
epilepsy
- Advertisement -

స్నానం చేస్తూ పడిపోయి స్ట్రోక్ వచ్చిన వ్యక్తుల గురుంచి మనం తరచుగా వింటాము. ఇలా స్ట్రోక్‌ వచ్చి వేరే మరెక్కడా పడి పోవడం గురించి మనం ఎందుకు వినడంలేదు. ఈ విషయాల గురించి వైద్య ప్రముఖులు నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రొఫెసర్ ఈ విధంగా చెప్పారు. మీరు స్నానం చేసే ముందు తల స్నానం చేయవద్దు, మొదట మీ శరీరంలోని ఇతర భాగాలను శుభ్రపరచాలని సలహా ఇచ్చారు. ఎందుకంటే, తల తడిగా మరియు చల్లగా ఉన్నప్పుడు చల్లబడిన రక్తనాళాలలో ఉష్ణోగ్రత పెంచడానికి, రక్తం తలపైకి వేగంగా ప్రవహిస్తుంది. రక్త నాళాలు బలహీనంగా గాని, సన్నగా గాని ఉన్నట్లైతే, రక్త నాళాలు చిట్లిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా సాధారణంగా స్నానాల గదిలో జరుగుతుంది కాబట్టి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి.

  1. ముందుగా పాదం నుండి స్నానం ప్రారంభిచండి..తరువాత కాళ్ళు.తొడ..ఉదరం..భుజం..5-10 సెకన్ల పాటు ఆగిన తరువాత ఆపై యథావిధిగా తల స్నానం చేయండి. ఇక తల స్నానానికి మాత్రం తప్పనిసరిగా గోరువెచ్చని నీరు వాడండి. గోరువెచ్చని నీటీతో ఎందుకనేగా మీసందేహం.. ఎందుకంటే.. ఉదహారణకు వేడి నీటితో నిండిన గాజుపాత్రలో వేడి నీరు ఖాళీ చేసి వెంటనే చల్లటి నీటితో నింపండి. ఏం జరుగుతుంది ? గాజు పాత్ర పగిలిపోతుంది. అదే విధంగా మన శరీర ఉష్ణోగ్రత చాలా వేడిగా ఉంటుంది మరియు నీరు చల్లగా ఉంటుంది, మనం స్నానం తల స్నానంతో మొదలు పెడితే, రక్త నాళాల ఉష్ణోగ్రతల మార్పు వలన తలలో రక్తనాళాలు చిట్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందువలన అకస్మాత్తుగా బాత్రూంలో పడటం మనం తరచుగా చూస్తాము. కానీ తప్పుడు స్నాన పద్ధతి కారణంగానే, మనకు స్ట్రోక్ గాని లేదా మైగ్రేను(తలనొప్పి) రావడానికి కారణం అని మనకు తెలియదు. అందుకే మీరు స్నానం చేసేటప్పుడు ఈ పద్దతిని పాటించండి.
- Advertisement -