బీసీసీఐ చీఫ్‌ గంగూలీకి కరోనా..

95
ganguly
- Advertisement -

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడ్డారు. సోమవారం రాత్రి ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. మైల్డ్ సింప్టమ్స్ ఉన్నప్పటికీ.. ముందు జాగ్రత్తగా ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు గంగూలీ.

ఈ ఏడాదిలో గంగూలీ హాస్పిటల్ పాలవడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఆరంభంలో ఛాతిలో నొప్పి కారణంగా హాస్పిటల్‌లో చేరగా హార్ట్ అటాక్ అని తేలింది. కోల్‌కతాలోని తన నివాసంలో ఎక్సర్‌సైజ్ చేస్తుండగా.. గంగూలీకి హార్ట్ అటాక్ వచ్చింది. దీంతో రైట్ కరోనరీ యాంజియోప్లాస్టీ నిర్వహించారు.

తర్వాత కూడా గంగూలీకి అదే విధంగా ఛాతిలో నొప్పి రావడంతో..జనవరి 28న మరోసారి యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ఈ ప్రక్రియలో భాగంగా గుండెలో రెండు స్టంట్లను అమర్చారు.

- Advertisement -