విలువైన ఆస్తిని కొల్పోయాం:రాహుల్,సోనియా

172
rahul
- Advertisement -

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ. నమ్మకమైన సహోద్యోగి, స్నేహితుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు సోనియా. ఆయన జీవితమంతా కాంగ్రెస్‌ పార్టీకి అంకితం చేశారని…. పటేల్‌ అంకిత భావం, తన కర్తవ్యం పట్ల ఆయనకున్న నిబద్ధత, సహాయం అందించేందుకు ఎల్లప్పడూ ముందండడం, ఔదార్యం ఆయనకున్న అరుదైన లక్షణాలన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ చాలా విలువైన ఆస్తిని కోల్పోయిందని అన్నారు రాహుల్ గాంధీ. అహ్మద్‌ పటేల్‌ నెహ్రూ గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆయన మూలస్తంభం లాంటివారని… కాంగ్రెస్‌ పార్టీయే తన శ్వాసగా జీవితాంతం పనిచేశారని, ఎన్నో కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచారని చెప్పారు. అహ్మద్‌ పటేల్‌ మృతిపట్ల కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -