ఆస్పత్రిలో ఖైదీలా చూశారు..!

2
- Advertisement -

NEET-UG పేపర్ లీక్‌పై ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి మద్దతుగా 26 రోజుల నిరాహార దీక్ష ప్రారంభించిన సోనమ్ వాంగ్‌చుక్…జూలై 18న పోలీసులు తనను ఆసుపత్రికి తరలించిన తర్వాత సఫ్‌దర్‌జంగ్ ఆసుపత్రిలో తనను ఒక ఖైదీలా చూశారు అని అన్నారు.

59 ఏళ్ల వాంగ్‌చుక్‌ను జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తుండగా వైద్యుల సలహా మరియు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను ఉటంకిస్తూ ఢిల్లీ పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. గురువారం తన దీక్షను విరమించిన అనంతరం వాంగ్‌చుక్ తన పరిస్థితిని వివరిస్తూ 24 నిమిషాల వీడియోను పోస్ట్ చేశారు.

అది కేవలం ఆసుపత్రి మాత్రమే కాదు…ఒక సైనిక శిబిరంలా, ఒక జైలులా ఉంది. బహుశా ఒక ఖైదీని కూడా ఉంచని రీతిలో నన్ను అక్కడ ఉంచారు. నన్ను కనీసం బయటకు అడుగు పెట్టడానికి కూడా అనుమతించలేదు. నా గది దరిదాపుల్లోకి ఎవరూ రాలేరు, కనీసం ఒక పిట్ట కూడా వాలలేకపోయింది అని ఆయన వీడియోలో తెలిపారు.

నన్ను ఎవరినీ కలవనివ్వలేదు. కేవలం భద్రతా సిబ్బందిని మాత్రమే అనుమతించారు. నా బంధువులను కూడా నన్ను చూడనివ్వలేదు. మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉంచుకోవడానికి అనుమతి లేదు, ఎలాంటి సమాచారం పంపడానికి మార్గం లేకుండా చేశారు. నేను కమ్యూనికేట్ చేయడానికి ఉన్న ఒకే ఒక మార్గం కాగితం ముక్కలపై నోట్స్ రాయడం, అది కూడా చాలా కష్టంగా, అరుదుగా మాత్రమే జరిగింది అన్నారు.

Also Read:తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి శోభ

లండన్ నుండి వచ్చిన తన బంధువులు, స్నేహితులను కూడా ఆసుపత్రిలో కలవకుండా అడ్డుకున్నారని వాంగ్‌చుక్ చెప్పారు. ఇదంతా చట్టవిరుద్ధం. ఉత్తర కొరియాలో ఉన్నట్లు అనిపించింది. నన్ను ఉంచిన ప్రదేశం జైలుకు ఏమాత్రం భిన్నంగా లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -