TTD:సింహ వాహనంపై సిరులతల్లి

5
- Advertisement -

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు బుధవారం రాత్రి సింహ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో అమ్మవారు భక్తులను క‌టాక్షించారు.

సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వాహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీరత్వం , యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది. శ్రీ వేంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.

Also Read:లంగ్స్‌ ఆరోగ్యం కోసం బ్రీతింగ్ చెక్!

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఆల‌య‌ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

- Advertisement -