టీఆర్ఎస్‌తోనే పాలమూరు ప్రజలు:నిరంజన్ రెడ్డి

448
singireddy niranjan reddy
- Advertisement -

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు అపూర్వ విజయం అందించిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు, నేతలకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.

అందరం సమన్వయంతో పనిచేయడంతోనే నాగర్ కర్నూలు పార్లమెంటు ఎన్నికలో అత్యధిక మెజారిటీతో పోతుగంటి రాములు విజయం సాధ్యమైందన్నారు.

గతంలో మూడుసార్లు సాంకేతికంగా నాగర్ కర్నూలులో విజయం దూరమయినా ఈసారి లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు.టీఆర్ఎస్ కు కీలక సమయాలలో అండగా నిలిచిన పాలమూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

అప్పుడు కేసీఆర్ ను గెలిపించి పాలమూరు ప్రజలు తెలంగాణ ఏర్పాటుకు తోడు నిలిచారు..ఇప్పుడు రెండుస్థానాలలో టీఆర్ఎస్ ను గెలిపించి ప్రజలు మరోసారి తాము టీఆర్ఎస్ వెంటేనని చాటారని గుర్తుచేశారు.

- Advertisement -