మరోసారి గాయత్రి సెట్స్‌లో జై సింహా..

212
Simha on Gayatri Sets
- Advertisement -

మోహన్‌ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 42 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన చేస్తున్న సినిమా ‘గాయత్రి’. మోహన్ బాబు సొంత బ్యానర్ శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహిస్తుండగా మోహన్ బాబు స్వయంగా నిర్మాణ భాద్యతలు చేపట్టారు. ఎస్‎ఎస్ తమన్ సంగీత సారథ్యంలో వస్తున్న ఈ సినిమా టైటిల్ లుక్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

 Simha on Gayatri Sets

గత కొద్దిరోజుల క్రితమే గాయత్రి షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లి అందరిని ఆశ్చర్యపర్చిన బాలయ్య మరోసారి అదేపనిచేశాడు. బాలయ్య రాక గురించి ట్వీట్  చేసిన విష్ణు  ‘ఆయనే మరోసారి గాయత్రి సెట్స్ పైకి వచ్చారు. ఎవరో గుర్తుపట్టండి’ అంటూ.. బాలయ్య బాబు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుకనుండి తీసిన ఫోటోను జత చేశాడు. ఇంకేముంది ఆ ఫొటోలో ఉంది బాలయ్య బాబే అంటూ అంతా వెంటనే గుర్తుపట్టి రిప్లైలు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్‌చల్ చేస్తోంది.

గాయత్రి చిత్రంలో మోహన్ బాబు డబుల్ యాక్షన్ చేయనున్నట్టు స‌మాచారం. ఇందులో ఒకటి హీరో పాత్ర అయితే.. ఇంకోటి విలన్ క్యారెక్టర్ అట. హీరోగా.. విలన్ గా గొప్ప గొప్ప పాత్రలు చేసిన మోహన్ బాబు.. ఒకే సినిమాలో ఇలా రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడం అందరికి ఇంట్రస్టింగ్ గా వుంది.  మంచు విష్ణు కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నాడని తెలుస్తుండగా, యాంకర్ అనసూయ జర్నలిస్ట్ పాత్ర పోషించనుంది.

- Advertisement -