గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ‘శ్యాం సింగరాయ్’ బృందం..

206
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ ప్రసాసన్ నగర్ లోని జిహెచ్‌ఎంసి పార్క్‌లో శ్యాం సింగరాయ్ చిత్ర బృందం హీరో నాని,హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి,నిర్మాత బోయినపల్లి వెంకట్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఉద్యమంలా ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు. సినిమా ఇండస్ట్రీ,రాజకీయ నాయకులు ఇలా అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో ఎంతో అవగాహన కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని నాని అన్నారు. గ్లోబల్ వార్మిగ్‌ను అరికట్టడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దోహదపడుతుందని.. భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నాని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌడర్‌ రాఘవ వృకవేదం పుస్తకాన్ని హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టికి అందజేశారు. ప్రకృతిపై ప్రేమతో వేదాలతో కూడిన వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్‌పై నాని, సాయి పల్లవి, కృతిశెట్టి ప్రశంసల జల్లు కురిపించారు.

- Advertisement -